అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు గవర్నర్ రోశయ్యతో సమావేశమయ్యారు.
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు గవర్నర్ రోశయ్యతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన జయలలిత రేపు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత గవర్నర్ను కలసి చర్చించారు. జయలలిత రేపు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితాను రో్శయ్యకు అందజేశారు.
ఈ రోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేయగా రోశయ్య ఆమోదించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు జయలలితను ఆహ్వానించారు.