ఫైవ్ స్టార్ హోటల్ సంచలన నిర్ణయం
అకాలవర్షాలతో బాధలు పడుతున్న చెన్నై ప్రజలకు సంఘీభావంగా స్థానిక హోటెల్ సంచలన నిర్ణయం తీసుకుంది.
చెన్నై: అకాల వర్షాలతో బాధలు పడుతున్నచెన్నై ప్రజలకు సంఘీభావంగా స్థానిక హోటల్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, 2016 నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అష్టకష్టాలు పడుతూ మన చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థనలు చేద్దాం... విలాసాలు కాదంటూ పిలుపు నిచ్చింది. దీంతో పాటు పట్టణంలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎత్తైన క్రిస్మస్ చెట్టు ఏర్పాటును కూడా రద్దు చేసేందుకు నిర్ణయించింది.
చెన్నైకు చెందిన ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లి రాయల్ మెరిడియాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. హోటల్ ఛైర్మన్ పీజీ పెరియ స్వామి ప్రకృతి విపత్తుతో విలవిల్లాడిన బాధితులను అందరం కలిసికట్టుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.