అమృత్, స్మార్ట్ సిటీస్ కు 7296 కోట్లు | 7296 crores for amruth and smart citys | Sakshi
Sakshi News home page

అమృత్, స్మార్ట్ సిటీస్ కు 7296 కోట్లు

Mar 1 2016 4:12 AM | Updated on Sep 3 2017 6:42 PM

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్‌లకు రూ. 7296 కోట్లను కేటాయించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్‌లకు రూ. 7296 కోట్లను కేటాయించారు. ఇందులో అమృత్ పథకానికి రూ. 4091 కోట్లు, స్మార్ట్‌సిటీస్ మిషన్‌కు రూ. 3205కోట్లు కేటాయించారు. 100 నగరాలను ఎంపిక చేసి అందులో తొలి విడతగా టాప్-20 నగరాలను అభివృద్ధి (తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సాంకేతికత, కనీస మౌలిక వసతులు వంటివి) చేసేందుకు గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో నగరానికి ఐదేళ్లపాటు రూ.500కోట్ల నిధులిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement