‘రంగస్థలం’లో ఎన్టీఆర్‌..?

Ram charan in Rangasthalam - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ప‍్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ టీజర్‌ లతో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ‘ఎంత సక్కగున్నవే..’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.

తాజాగా ఈ సినిమాకుసంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. సినిమా 1985 లో జరిగే కథ కావటంతో సినిమాలో అప్పటి రాజకీయాల ప్రస్థావన కూడా కనిపించనుందట. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రస్థావన సినిమాలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే పొలిటికల్‌ సన్నివేశాలు సినిమాలో ఏమేరకు ఉంటాయన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top