తమిళసినిమా; దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలన్న నానుడిని నటి నయనతార అక్షరాలా పాటిస్తున్నారు. కథానాయికగా టాప్ పొజిషన్లో ఉన్న నయనతార ప్రముఖ హీరోల నుంచి వర్ధమాన హీరోలతో సైతం నటించడానికి రెడీ అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల నాయకిగాను సక్సెస్ సాధించి విజయానికి చిరునామాగా మారారు. నయనతార గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2005లో కోలీవుడ్కు అయ్యా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆరంభంలో 40 నుంచి 50 లకారాలు పుచ్చుకున్న ఈ కేరళా కుట్టి ఆ తరువాత రజనీకాంత్, విజయ్, అజిత్కుమార్, సూర్య, ధనుష్, శింబు వంటి ప్రముఖ హీరోలతో జత కట్టే అవకాశాలు దక్కించుకున్నారు.
అలాగే తెలుగులోనూ ప్రముఖ కథానాయకుల సరసన నటించారు. ఆ చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో తన పాపులారిటీతో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూ పోయారు. అలా రూ.కోటి వరకూ పారితోషికం పుచ్చుకుంటూ వచ్చిన నయనతార అనూహ్యంగా ప్రేమ వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో నయనతార పనైపోయింది. ఆమె మార్కెట్ డౌన్ అయిపోతుంది. అని చాలా మంది అనుకున్నారు. అయితే అది నిజం కాదని నిరూపించారు నయన్. ప్రేమ సమస్యల నుంచి బయటపడి రీఎంట్రీ ఇచ్చి పూర్వ వైభవాన్ని మించి సాధించారు.
ఆ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం మాయలో దెయ్యంగానూ, కథానాయికకు ప్రాముఖ్యత ఉన్న నానుమ్ రౌడీదాన్ చిత్రంలో చెవిటి అమ్మాయిగా నటించి ఆ చిత్రాల విజయాలకు మూల కారణంగా నిలిచారు. అలాగే తనీఒరువన్, ఇదునమ్మఆళు వంటి కమర్షియల్ చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకున్న నయన్ సహ నటీమణులు త్రిష, శ్రీయ, ప్రియమణిలను అధిగమించి విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న అనుష్క, సమంత, శ్రుతీహాసన్, హన్సికలు కూడా తన దరిదాపుల్లోకి రానంత ఉన్నత స్థాయికి చేరుకున్న నయనతార ఇప్పుడు రూ.మూడు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
తాజాగా మాతృ భాషలో కూడా నటించడం మొదలెట్టిన ఈ కేరళా కుట్టి రూ.నాలుగు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. చేతి నిండా సినిమాలున్న నయనతార ఇటీవల ఒక నిర్మాత ప్రముఖ హీరోకు జంటగా నటించడానికి కాల్షీట్స్ అడగ్గా పారితోషికం రూ.నాలుగు కోట్లు ఇస్తానంటే కాల్షీట్స్ గురించి మాట్లాడదాం అని కుండ బద్దలు కొట్టినట్లు అన్నారట. దీంతో కరెంట్ షాక్ కొట్టినంత పనైందట ఆ నిర్మాతకు. మరోమాట లేకుండా నిర్మాత అక్కడ నుంచి జారుకున్నారట.
నాలుగు కోట్ల డిమాండ్ చేస్తున్న నయన్
Published Tue, Jul 26 2016 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement