లైవ్‌ స్ట్రీమింగ్‌లో పోప్‌ ఈస్టర్‌ సందేశం | Pope Francis to Live-Stream Easter Services from St. Peter’s Basilica | Sakshi
Sakshi News home page

లైవ్‌ స్ట్రీమింగ్‌లో పోప్‌ ఈస్టర్‌ సందేశం

Apr 13 2020 5:51 AM | Updated on Apr 13 2020 5:51 AM

Pope Francis to Live-Stream Easter Services from St. Peter’s Basilica - Sakshi

వాటికన్‌ సిటీ: కోవిడ్‌ మహమ్మారిపై పోరాటం చేస్తూ ప్రపంచమే లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ఈస్టర్‌ వేడుకల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇటలీ నుంచి పనామా వరకు చర్చిలన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండే ప్రార్థనలు చేసుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న సెయింట్‌ పీటర్‌ చర్చిలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సోదరభావంతో ఒక్కటై కోవిడ్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ఇవాళ నా ఆలోచనలన్నీ కోవిడ్‌ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయి. ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారు. తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారు’’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement