సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపాన్ని తెలిపారు.
హైదరాబాద్: సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని స్వగృహంలో ఉన్న గిరిబాబుకు గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే.