నటుడు గిరిబాబుకు వైఎస్ జగన్ పరామర్శ | ys jagan console to actor giribabu | Sakshi
Sakshi News home page

నటుడు గిరిబాబుకు వైఎస్ జగన్ పరామర్శ

May 12 2016 7:55 PM | Updated on Jul 25 2018 4:09 PM

సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు.

హైదరాబాద్: సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని స్వగృహంలో ఉన్న గిరిబాబుకు గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement