ప్రభుత‍్వమే నడిపిస్తోంది: వీహెచ్‌ | Sakshi
Sakshi News home page

ప్రభుత‍్వమే నడిపిస్తోంది: వీహెచ్‌

Published Mon, May 15 2017 12:00 PM

v hanumantha rao slams trs over dharna-chowk

హైదరాబాద్: ధర్నా చౌక్‌ వద‍్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్‌ నేత, రాజ‍్యసభ మాజీ సభ‍్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్‌ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement