కర్ణాటకలో అదృశ్యం.. కోఠిలో ప్రత్యక్షం! | Three children who disappeared in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో అదృశ్యం.. కోఠిలో ప్రత్యక్షం!

Sep 1 2017 10:31 AM | Updated on Sep 12 2017 1:34 AM

కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కోఠి ఆంధ్రబ్యాంక్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు.

హైదరాబాద్‌: కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కోఠి ఆంధ్రబ్యాంక్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు. అయోమయంగా తిరుగుతున్న లాక్ష్‌, కరణ్‌, వినీత్‌ అనే ముగ్గురు చిన్నారులను చేరదీసిన సుల్తాన్‌బజార్‌ పోలీసులు వారి గురించి విచారణ చేపట్టగా తమది కర్ణాటక బీదర్‌ అని తెలిపారు.

కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఈశ్వర్‌బేమన్న బంధువులు అని గుర్తించిన పోలీసులు వారికి సమాచారం అందించారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు నగరానికి వచ్చి ముగ్గురు చిన్నారులను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసుల పనితీరును కర్ణాటక మంత్రి మెచ్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement