కర్ణాటక రాష్ట్రం బీదర్లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కోఠి ఆంధ్రబ్యాంక్ వద్ద ప్రత్యక్షమయ్యారు.
కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఈశ్వర్బేమన్న బంధువులు అని గుర్తించిన పోలీసులు వారికి సమాచారం అందించారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు నగరానికి వచ్చి ముగ్గురు చిన్నారులను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసుల పనితీరును కర్ణాటక మంత్రి మెచ్చుకున్నారు.