రెవెన్యూ శాఖలో పేర్లు మార్పు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెవెన్యూ శాఖలో పేర్లు మార్పులు
Oct 20 2016 5:53 PM | Updated on Aug 14 2018 10:54 AM
హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టులు, కార్యాలయాల పేర్లు మార్పు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ ఆఫీసును తహసీల్ ఆఫీస్ లేదా తహసీల్ కార్యాలయంగా పిలవాలని ఆదేశించారు.
మండల రెవెన్యూ ఆఫీసర్లను తహసీల్దార్లుగా, డిప్యూటీ తహసీల్దార్లను నాయబ్ తహసీల్దార్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను గిర్దావర్లుగా మార్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై మార్చిన కొత్త పేర్లు వాడుకలోకి రానున్నాయి.
Advertisement
Advertisement