సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లలితానగర్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు
హైదరాబాద్: సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లలితానగర్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామానికి చెందిన ప్రదీప్కుమార్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఫలితం లేకపోవటంతో మనస్తాపం చెంది తను ఉండే గదిలోనే శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయాడు.
మధ్యాహ్నం గమనించిన తోటి వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద లభించిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.