వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే రోజా | mla roja met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే రోజా

Mar 17 2016 7:30 PM | Updated on Aug 31 2018 9:15 PM

వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే రోజా - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్యే రోజా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం లోటస్ పాండ్లో కలిశారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం లోటస్ పాండ్లో కలిశారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై హైకోర్టు మధ్యంతర ఉత్వర్తులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కోర్టు తీర్పును ఆమె వివరించారు.

 

కాగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంతకు ముందు రోజా... కోర్టు ఆర్డర్ కాపీని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణకు అందచేశారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement