మద్యం మత్తులో పోలీసుల వీరంగం | locals attack drunken constables in lb nagar | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పోలీసుల వీరంగం

Jun 11 2016 9:55 PM | Updated on Mar 19 2019 6:01 PM

మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే విచక్షణ మరిచి ఓ మహిళపై దాడికి దిగారు.

హైదరాబాద్(ఎల్బీనగర్): మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే విచక్షణ మరిచి ఓ మహిళపై దాడికి దిగారు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కలగజేసుకొని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కామినేని సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

స్థానికంగా ఉన్న పీఆర్ వైన్స్‌లో పీకల దాక తాగిన ఇద్దరు కానిస్టేబుళ్లు వైన్స్ ఎదుట తినుబండారాలు అమ్ముకుంటున్న సుమలత అనే మహిళపై దాడి చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా గోపి, అంబర్‌పేట్‌లో గ్రెహౌండ్స్ కానిస్టేబుల్‌గా సుధాకర్ పని చేస్తున్నారు.  ఈ రోజు సాయత్రం నుంచి వైన్స్‌లో తాగుతూ మద్యం మత్తులో యువతిని తీవ్రంగా కొట్టడంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీ టీవీ ఫూటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement