ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాంగ్రెస్ ఆందోళన
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధి పోరు గర్జన జరిగింది.
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధి పోరు గర్జన నగరంలోని దిల్సుఖ్నగర్లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ..విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఎంఎల్సీ షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్రెడ్డి, బిక్షపతి యాదవ్, కార్తీక్ రెడ్డి, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.