ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందాడు.
ఎర్రుపాలెం: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఎర్రూపాలెం మండలంలోని రామన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. 5వ తరగతి చదువుతున్నకొత్తపల్లి కార్తీక్(11) కొత్తపల్లి సత్యంబాబు- శారద దంపతులకు రెండో కుమారుడు. తన స్నేహితులతో కలిసి బహిర్బూమికి చెరువు వద్దకు వెళ్లాడు.
చెరువులో పొక్లెనుతో తీసిని నీటి గుంతలోకి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. అతనితో ఉన్న స్నేహితులు వెంటనే ఆ పిల్లవాడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేశారు.