పది రోజుల పసికందు మృతదేహం హైదరాబాద్ ట్యాంక్బండ్పై లభ్యమైంది.
పది రోజుల పసికందు మృతదేహం ట్యాంక్బండ్పై లభ్యమైంది. ట్యాంక్బండ్పై మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఒక బ్యాగ్ను వదిలేశారు. గమనించిన చుట్టుపక్కల వారు తెరిచి చూడగా పసికందు మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.