గ్యాస్ కట్టర్లతో లాకర్లు తెరచి.. | Andhra Bank robbery In Ranga Reddy district, | Sakshi
Sakshi News home page

గ్యాస్ కట్టర్లతో లాకర్లు తెరచి..

Feb 15 2016 4:57 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఆంధ్రాబ్యాంకు శాఖలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి తర్వాత గ్యాస్ కట్టర్లతో లాకర్లు తెరచి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు.

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఆంధ్రాబ్యాంకు శాఖలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి తర్వాత గ్యాస్ కట్టర్లతో లాకర్లు తెరచి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ రాంచందర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సుమారు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు లోపలికి చొరబడి గ్యాస్ కట్టర్లతో లాకర్లు తెరచినట్టు ఆయన వెల్లడించారు.
 ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 60 నుంచి 70 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారని... నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్టు తెలిపారు. మరోవైపు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలను సేకరించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement