శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టివేత
Dec 3 2015 9:27 AM | Updated on Sep 3 2017 1:26 PM
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారం, కిలో వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం దుబాయి నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ లగేజీలో అధిక మొత్తంలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారం, వెండికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
Advertisement
Advertisement