ఫ్లాష్బ్యాక్
ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా రకరకాల సబ్బులను ఉపయోగిస్తున్నాం మనం. మన దేశంలో ఒకప్పుడు సబ్బుల వాడుక చాలా తక్కువ. పాశ్చాత్య వలస పాలకుల ద్వారానే ఇవి మనకు పరిచయమయ్యాయి. అలాగని సబ్బు ఆధునిక ఆవిష్కరణేమీ కాదు. క్రీస్తుపూర్వం నుంచే సబ్బు వంటి పదార్థాలు వాడుకలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన బాబిలోనియన్ ప్రజలు క్రీస్తుపూర్వం 2800 ఏళ్ల కిందటే సబ్బు వంటి పదార్థాన్ని వాడేవారు.
నీరు, క్షార పదార్థం, కాసియా నూనెలతో సబ్బు వంటి పదార్థాన్ని తయారు చేసే ఫార్ములా రాసి ఉన్న బాబిలోనియన్ల రాతి పలక ఒకటి తవ్వకాల్లో బయటపడింది. అది క్రీస్తుపూర్వం 2200 ఏళ్ల నాటిదని పరిశోధకులు అంచనా వేశారు. ప్రాచీన ఈజిప్షియన్లు సైతం క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో క్షార పదార్థాలు, శాకాహార నూనెలు, జంతువుల కొవ్వులు ఉపయోగించి సబ్బువంటి పదార్థాన్ని తయారు చేసేవారు. అప్పట్లో చైనా వారు సబ్బుల తయారీలో నూనెలు, కొవ్వులు, క్షారాలతో పాటు మూలికలను కూడా వాడేవారు.
క్రీస్తుశకం పదమూడో శతాబ్ది నాటికి పశ్చిమాసియా ప్రాంతంలో సబ్బుల తయారీ కుటీర పరిశ్రమ స్థాయికి ఎదిగింది. పదిహేనో శతాబ్ది ద్వితీయార్ధం నాటికి ఫ్రాన్స్లో సబ్బుల తయారీ పరిశ్రమ బాగా పుంజుకుంది. అయితే, పారిశ్రామిక విప్లవానికి ముందు సబ్బుల పరిశ్రమలు అక్కడక్కడా ఉన్నా, వాటి ఉత్పత్తి పరిమితంగానే ఉండేది.
పారిశ్రామిక విప్లవం తర్వాత 19వ శతాబ్దిలో పలు పరిశ్రమలు భారీస్థాయిలో సబ్బుల తయారీ ప్రారంభించాయి. అప్పటి నుంచే రకరకాల ఆకారాలు, రంగులు, పరిమళాలతో ఆకర్షణీయమైన ప్యాకింగులతో బ్రాండెడ్ సబ్బులు మార్కెట్ను ముంచెత్తడం మొదలైంది. విస్తృత వ్యాపార ప్రచారం కూడా తోడవడంతో సబ్బుల వాడుక వెనుకబడిన దేశాలకూ పాకింది.
శతాబ్దాల సబ్బు
Published Sun, Feb 21 2016 4:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సినేషన్
పింఛన్ కోసం వెళ్తూ..
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి
భీకర గాలులు–నేలకొరిగిన చెట్లు
ఇచ్చాపురం జనసంద్రం..
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement