స్మార్ట్ సిటీగా చెప్పుకునే కాకినాడలో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు.
స్మార్ట్ సిటీ కాదు కంపు సిటీ : కన్నబాబు
Jul 23 2016 4:45 PM | Updated on Aug 10 2018 8:16 PM
కాకినాడ : స్మార్ట్ సిటీగా చెప్పుకునే కాకినాడలో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. శనివారం కాకినాడ రూరల్లోని రమణయ్యపేటలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అవినీతి పాలనపై పార్టీ ప్రచురించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. నగరంలోని పలు సమస్యలు కన్నబాబు దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. డ్రైనేజీ వ్యవస్ధ సవ్యంగా లేకపోడంతో కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటితో ఇబ్బందులు పడుతున్నారని కన్నబాబు తెలిపారు. నీరు.. విద్యుత్ సమస్యలతో పాటుగా నగరంలో కుక్కులు.. పందుల బెడద ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించకపోతే తాము పార్టీ తరపున ఉద్యమిస్తాని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement