'జగనన్న వెంటే ఉంటా, పార్టీని వీడేది లేదు' | ysrcp kavali mla ramireddy prathap kumar reddy condemns rumours of joining TDP | Sakshi
Sakshi News home page

'జగనన్న వెంటే ఉంటా, పార్టీని వీడేది లేదు'

May 11 2016 9:05 AM | Updated on Jul 25 2018 4:09 PM

'జగనన్న వెంటే ఉంటా, పార్టీని వీడేది లేదు' - Sakshi

'జగనన్న వెంటే ఉంటా, పార్టీని వీడేది లేదు'

తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

నెల్లూరు: తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే  రామిరెడ్డి  ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను జగనన్న వెంటే ఉంటానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పచ్చ ప్రలోభాలకు తాను లొంగేది లేదని, అవాస్తవాలను ప్రసారం చేయటం తగదని, తన వివరణ తీసుకుంటే బాగుండేదని ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement