మోటార్ సైకిల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Sep 16 2016 11:44 PM | Updated on Aug 30 2018 4:10 PM
ఎమ్మిగనూరురూరల్: మోటార్ సైకిల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామం సమీపంలోని శ్రీరామ్నగర్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మద్దికెర మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన వెంకట్రాముడు, పార్వతమ్మల ఏకైక కుమారుడు రాము(22)..బెంగళూరుకు వలస వెళ్లి ఇంటి నిర్మాణ పనులు చేస్తుండేవాడు. వివాహం చేయాలని సంబంధాలు చూస్తుండటంతో తండ్రిని బెంగళూరులోనే వదలి పది రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. హోసూర్లో పెళ్లి సంబంధం చూసినా అది కుదరలేదు. శుక్రవారం సాయంత్రం మోటార్ సైకిల్పై ఎమ్మిగనూరుకు వస్తుండగా.. ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీరామ్నగర్ దగ్గర ఢీ కొట్టింది. హెల్మ్ట్ ధరించినా..తల బస్సు టైర్ కింద పడటంతో మృత్యువాత పడ్డాడు. ప్రమాద విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకొనివిషయాలను తెలుసుకున్నారు. మతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా ప్రమాదం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశారు.
Advertisement
Advertisement