ఆటోలోంచి పడి మహిళ దుర్మరణం | woman slips in auto and died | Sakshi
Sakshi News home page

ఆటోలోంచి పడి మహిళ దుర్మరణం

Jun 15 2016 1:24 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఆటోలోంచి పడి మహిళ దుర్మరణం - Sakshi

ఆటోలోంచి పడి మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. తల్లి మరణించిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న చిన్నారి అమాయకపు చూపులతో..

వెల్మకన్న వద్ద ఘటన
తల్లడిల్లిన చిన్నారి
స్పృహకోల్పోయిన భర్త

 కౌడిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. తల్లి మరణించిన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న చిన్నారి అమాయకపు చూపులతో ‘అమ్మా, లేవమ్మా..’ అంటూ తల్లిని తడుముతూ రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని వెల్మకన్న రైస్‌మిల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని సదాశివపల్లి పంచాయతీ పరిధిలోని బురుగడ్డ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల లలిత (32), నర్సింలు భార్యాభర్తలు. వీరికి కొడుకు శేఖులు (7వ తరగతి), కూతురు మహేశ్వరీ (రెండో తరగతి) ఉన్నారు.

కొట్లాల పంచాయతీ పరిధిలోని లింగంపల్లిలో బంధువును పరామర్శించేందుకు లలిత, ఆమె ఆడపడచు నాగమణి తదితరులు కౌడిపల్లికి వచ్చారు. అక్కడి నుంచి ఆటో వెనుక వైపు కూర్చోని లింగంపల్లి వెళ్తున్నారు. వెల్మకన్న రైస్‌మిల్ సమీపంలో ఆటో వేగం పెరిగింది. ఈ క్రమంలో లలిత ఒక్కసారిగా కిందపడి పోయింది. తలకు తీవ్ర గాయం కాగా కౌడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

 కంటతడిపెట్టించిన కూతురు రోదించిన తీరు...
వ్యవసాయ పనులు చేస్తున్న నర్సింలుకు విషయం తెలియడంతో స్కూల్‌కు వెళ్లి కూతురు మహేశ్వరిని తీసుకుని కౌడిపల్లికి వచ్చాడు. విగత జీవిగా పడివున్న భార్యను చూసి రోదిస్తూ సృహతప్పిపడిపోయాడు. అతణ్ణి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయించారు. తల్లిని చూసిన కూతురు మహేశ్వరీ బోరున విలపించింది. అమ్మా, లేవమ్మా.. అంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆటోలో నర్సాపూర్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement