- కూలి పనులకు సైకిల్పై బయలుదేరిన దంపతులు
- వేగంగా వచ్చి ఢీకొన్న బస్సు
- రోడ్డుపైనే మాంసపు ముద్దలా మిగిలిన భార్య
- భర్తకు తీవ్ర గాయాలు
-------------------------------------------------------------------
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఒక రోజు కూలి పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి.. వచ్చే అరకొర సంపాదనతోనే పిల్లలను చదివించుకుంటున్నారు. తెలవారక ముందే కూలి పనులకు వెళ్లడం ఆ దంపతులకు అలవాటు. రోజులాగే గురువారం తెల్లవారుజామున సైకిల్పై దంపతులిద్దరూ బయలుదేరారు. మార్గమధ్యంలో వేగంగా ఎదురొచ్చిన ఓ బస్సు ఢీకొనడంతో సైకిల్ నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే రోడ్డుపై మాంసపు ముద్దలా మిగలగా, భర్త త్రుటిలో తప్పించుకున్నాడు.
- పామిడి
-----------------------------------------------------------
పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత రంగమ్మ(36) రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాతపడగా, ఆమె భర్త మేకల పెద్దసుంకన్న తీవ్రంగా గాయపడ్డారని ఎస్ఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. వారిద్దరూ గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు సైకిల్పై ఇటుకల బట్టీ వద్ద పనుల కోసం బయలుదేరారు. బైపాస్లోని హనుమాన్ లింకురోడ్డు జంక్షన్ వద్దకు రాగానే సైకిల్ను బట్టీల వైపునకు తిప్పారు.
దూసుకొచ్చిన మృత్యువు
అంతలోనే ఊహించని రీతిలో అనంతపురం నుంచి గుత్తి వైపునుక విపరీతమైన వేగంతో వచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొనడంతో సైకిల్ తునాతునకలు కాగా, వెనకాల కూర్చున్న రంగమ్మ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆమె భర్త పెద్దసుంకన్న డివైడర్పై ఎగిరిపడి సృహ కోల్పోయాడు. ప్రమాదంలో అతని ఎడమకాలుకూ గాయమైంది. క్షతగాత్రుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతురాలికి కుమార్తె దస్తగిరమ్మ(డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది), కుమారుడు వసంతకుమార్(పామిడిలోని టీసీ హైస్కూల్లో ఆరో తరగతి చదవుతున్నాడు) ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిశంకర్రెడ్డి తెలిపారు.
తెల్లారిన బతుకు
Published Thu, Jan 5 2017 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement