మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులు టీఎంయూకు అండగా నిలవడం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి బస్ డిపో ఆవరణలో టీఎంయూ ఎన్నికల శంఖారావం పూరించింది.
– ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి రూరల్ : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులు టీఎంయూకు అండగా నిలవడం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి బస్ డిపో ఆవరణలో టీఎంయూ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాజీలేని పోరాటం చేసి రాష్ట్రావిర్భావంలో తమవంతు పాత్ర పోషించిన టీఎంయూ గుర్తింపు సంఘంగా విజయం సాధిస్తేనే సమస్యలు తీరుస్తుందన్నారు. ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తోందని, 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షుడు జగదీశ్వర్ ఆ సంఘానికి రాజీనామా చేసి తన అనుచరులు రేణారెడ్డి, మల్లప్ప, అనితలతో కలిసి టీఎంయూలో చేరారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని జగదీశ్వర్ చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, టీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ బాలాజీసింగ్, కార్మిక నాయకులు సూర్యప్రకాష్రావు, కౌన్సిలర్ ఆనంద్కుమార్, రామచంద్రారెడ్డి, టీఎంయూ నాయకులు రవీందర్, ఎల్పీ రెడ్డి, ఎంకే చారి, నందయ్య, సుందర్, నాగయ్య, నిరంజన్, డీఎల్ రెడ్డి, గోపి, చిన్నికృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.