అద్దంకి - నార్కట్పల్లి రహదారిపై చర్లపల్లి వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
అద్దంకి - నార్కట్పల్లి రహదారిపై చర్లపల్లి వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. చర్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ (38) గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో అద్దంకి వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.