జిల్లాలోని అనుముల మండలం పేరూరు చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నల్లగొండ: జిల్లాలోని అనుముల మండలం పేరూరు చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ శివారులోని పెద్ద చెరువు లూటు పోయిందని గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేపలు పడుతున్నారు. ఇది గుర్తించిన కాంట్రాక్టర్ అనుచరులు గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఒకరి పై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు గ్రామస్థులకు చెందిన రెండు ద్విచక్రవాహనాకు కాంట్రాక్టర్ అనుచరులు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.