టీడీపీ ప్రలోభ పర్వం.. | TDP trying to voter inducement in Municipal elections | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రలోభ పర్వం..

Apr 6 2016 3:47 AM | Updated on Aug 10 2018 8:16 PM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

డబ్బులు పంపిణీ చేస్తున్న కార్యకర్తలపై కేసు
సిద్దిపేట క్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణానికి చెందిన టీడీపీ  కార్యకర్తలు శనిగరం రాజశేఖర్, బొల్గ ప్రసన్న, మహేష్, అంబటి సతీష్, ఆర్మూర్ శ్రీనివాస్, రామకృష్ణ సోమవారం రాత్రి హనుమాన్ నగర్‌లో ఓటర్లకు డబ్బుల పంపిణీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పారిపోయారు. మయూరి దాబా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 17 వేలు స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement