జిల్లా వ్యాప్తంగా మైనింగ్ కారణంగా నష్టపోయిన గ్రామాలపై సమగ్ర సర్వే నిర్వహించి 15 రోజుల్లో నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అదేశించారు.
మైనింగ్ బాధిత గ్రామాలపై సర్వే
Sep 10 2016 12:55 AM | Updated on Sep 4 2017 12:49 PM
– కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా మైనింగ్ కారణంగా నష్టపోయిన గ్రామాలపై సమగ్ర సర్వే నిర్వహించి 15 రోజుల్లో నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అదేశించారు. శుక్రవారం తన చాంబరులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..మైనింగ్ వల్ల నష్టపోయిన గ్రామాలు, వ్యక్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లా మినరల్ పండ్ను ఏర్పాటు చేసిందన్నారు. మైనింగ్దారులు రాయల్టీ నుంచి 30 శాతం మొత్తాన్ని డీఎంఎఫ్కు చెల్లిస్తారన్నారు. దీని నుంచి మైనింగ్ బాధిత గ్రామాలను ఆదుకుంటామని వివరించారు. మైనింగ్ ఏఏ ప్రాంతాల్లో జరుగుతోంది... గ్రామాలు ఏ విధంగా నష్టపోయాయి. ఎవరెవరు ఏ విధంగా నష్టపోయారనే దానిపై సమగ్రంగా సర్వే చేయాలని తెలిపారు. సర్వే చేసేందుకు ఎంపీడీఓ, మండల వ్యవసాయాధికారి, తహసీల్దారు, మెడికల్ ఆఫీసర్, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, భూగర్బ జాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కమిటీగా ఏర్పడి సర్వే చేయాలని సూచించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ పూర్ణచంద్రరావు, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement