తిరుపతిలో విద్యార్థి సంఘాల ధర్నా | students union protest at svims director office | Sakshi
Sakshi News home page

తిరుపతిలో విద్యార్థి సంఘాల ధర్నా

Sep 3 2016 11:14 AM | Updated on Nov 9 2018 4:52 PM

పద్మావతి మెడికల్ కాలేజీ మొదటి విడత కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపించారు.

తిరుపతి: పద్మావతి మెడికల్ కాలేజీ మొదటి విడత కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. అందుకు నిరసనగా శనివారం తిరుపతిలోని స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. పెద్ద ఎత్తున మెడికల్ సీట్లు అమ్ముకున్నారని.. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

దీంతో స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement