శ్రీశైలం:
ఎక్కడైతే గంగ ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. గంగలేని చోట శివుడు ఉండడు.. శివుని లేనిచోట గంగకు తావుండదు. ఇది ప్రకతి ధర్మం.భక్తుల నమ్మకం కూడా...గంగా గౌరీ సమేతుడైన పరమశివుడు మల్లికార్జునుడిగా వెలసిన ప్రసిద్ధశైవక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రం. ఈ క్షేత్రంలో ఒక్కప్పుడు లెక్కలేనన్ని తీర్థ జలాలు, గుండాలతో అలారుతుండేది. అవన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. నేడు కొన్నిమాత్రమే మిగిలి ఉన్నాయి. ఈతీర్థ గుండాలలోని నీరు సేవించిన వారికి సర్వపాప ప్రక్షాళన జరుగడంతోపాటు ఆ తీర్థం అమత తుల్యమని వేదపండితులు చెబుతారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో మిగిలిన ఉన్న గుండాలలో మల్లికా, మనోహర , రుధిర, సరస్వతి , అమత , శంఖుతీర్థ ముఖ్యమైనవిగా మనం గమనించవచ్చు. మల్లన్న ఆలయప్రాంగణంలోని వీటి గురించిన వివరాలు....
మల్లికా గుండం
ఇది మల్లికార్జునస్వామివారి గర్భాలయానికి ఉత్తర దిశగా ఉంది. ఈశ్వరునికి జఠాజూఠంలో ఉన్న ఉన్న మల్లెపూల మకరందం జారి ఈ గుండంలో పడినందున మల్లికా గుండంగా ప్రసిద్ధి చెందిందంటారు. స్వామివారి గర్భాలయ విమాన కలశము ఈ నీటి గుండములో ప్రతిబింబిస్తుంది. గమనించదగ్గ విషయమేమింటంటే ఈ గుండం పై భాగం రాతి మండపంతో కప్పబడి మూసుకునిపోయి ఉన్నా విమాన కలశం కనిపించడం. ఈ గుండంలోని నీరు చూసినంత మాత్రానే సర్వపాపాలు హరిస్తాయంటారు. ఈ నీటితో స్నానం చేస్తే సర్వయజ్ఞాల ఫలం లభిస్తుందని, సర్వక్షేత్రాలలో తపస్సు చేస్తే ఎంత ఫలిముంటుందో అంత ఫలితం సునాయనంగా వస్తుందంటారు.
మనోహర గుండం
శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయానికి దక్షిణ భాగంలో ఉంది. లోకంలో సర్వ మహాతీర్థముల నీరు ఈ గుండంలో కలుస్తాయంటారు. ఇది గంగా సమానమైన తీర్థం. అంతటి విశేషమున్న తీర్థం మరెక్కడా లేదంటారు. ఈ నీటితో స్నానం చేసి స్వామి, అమ్మవార్లను పూజిస్తే సమస్త కోరికలు సిద్ధిస్తాయని చెబుతారు. ఈ గుండం దగ్గర మరణించిన వారు గణేశ్వరునిగానో, శ్రీమహావిష్ణువుగానో, పరమేశ్వరునిగానో మారిపోతారని స్థలపురాణం చెబుతుంది.
రుధిర గుండం
ఇది అమ్మవారి ఆలయంలో ఉత్తర దిక్కుగా ఉంది. ఈ గుండంలోని నీరు అమ్మవారి అభిషేకానికి వినియోగిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు ప్రీతి అందుకనే రుధిర గుండంగా పిలుస్తారు. ఈ నీరు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కలియుగాంతంలో ఈ గుండంలో ముసలి పిల్లలను కంటుందని, అప్పుడే యుగం అంతమైపోతుందనే జనగాథ.
ఘంటా గుండం
దేవాలయ ప్రాకారానికి ఉత్తర వాయువ్యదిశలో ఉన్న ఘంటా సిద్దేశ్వర మఠం ఆవరణలో ఉంది. మూడు లోకాలలో ఉండే సర్వతీర్థాలు ఇందులో ఉన్నాయని తపస్సు చేసే మునీశ్వరులు, సాధకులు ఇక్కడ అదశ్యరూపాల్లో నివసిస్తుంటారని స్థలపురాణం చెబుతుంది.
చంద్ర గుండం
ఘంటా మఠానికి ఉత్తరాన చంద్రేశ్వరం ఉంది. ఇక్కడ చంద్రగుండం ఉంది. పరమేశ్వరునికి నిశ్చల మనస్సుతో కామక్రోధాలు విడిచి పంచాక్షరే మంత్రంగా జపించి చంద్రకిరణములు సోకినంతనే ఈ గుండము నందలి నీరు తాగితే జరామరణాలు లేని దైవత్వం సిద్ధిస్తుందని అంటారు.
వరహ గుండం
పూర్వ ఆలయప్రాంగణంలో ఉండేదని అంటారు. బిందు తీర్థానికి పక్కనే సారంగధర మఠానికి ఉత్తరాన వరాహ గుండం ఒకటుంది. ఇది రాతితో వరాహం ఆకారంలో ఉండడంతో దానికి ఆ పేరొచ్చింది. ఈ నీరు చాలా పవిత్రమైనదిగా చెబుతారు.
బిందు తీర్థం
సారంగ మథానికి ఉత్తరు వాయువ్య దిక్కు కొంత దూరంలో బండ మధ్యవనున్న చిన్న మార్గంలో నుంచి కొద్ది కొద్దిగా నీరు వస్తు చిన్న గుంటలో నిలుస్తుంది. ఈ నీరు ఎల్లప్పుడూ ఉంటుంది. దీనిని బిందు తీర్థమని అంటారు. దీనినే స్థానికులు ‘మల్లమ్మకన్నీరు’ అంటారు. మల్లమ్మ అనే శివభక్తురాలు ఈ ప్రాంతంలోనే తపస్సు చేసి శివునిలో ఐక్యమైందని చెబుతారు.
దేవహ్రదం
శ్రీశైలానికి వాయువ్యదిశలో ఈ తీర్థముందని, ఇందులో ముద్గవర్ణముగల శిలలు, స్పర్శవేదులు ఉన్నాయని స్థలాపురాణం చెబుతోంది.
అమృతగుండం
ఇది మల్లికార్జునస్వామి ఆలయానికి దక్షిణ ౖనైరుతిలో ఉంది. గతంలో దీనిపైన సిమెంట్ బండలు పరచి దానికి రంధ్రాలు వేసి ఉంచారు. అయితే రెండేళ్ల క్రితం అప్పటి ఈవో చంద్రశేఖర ఆజాద్ వాటిని తొలగించి ఐరన్మెష్ వేసి భక్తులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ గుండంలోని నీరు మల్లికార్జున లింగం కిందుగా ప్రవహించి మల్లికాగుండంలో కలుస్తుందంటారు.