జర్నలిస్ట్‌లకు క్రీడలు అవసరం | sports needs journalists | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌లకు క్రీడలు అవసరం

Nov 30 2016 12:16 AM | Updated on Sep 4 2017 9:27 PM

నిత్యం వార్తల సేకరణలో మానసిక, శారీరక ఒత్తిడి ఉండే జర్నలిస్ట్‌లకు క్రీడలు చాలా అవసరం అని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు.

– ఎస్పీ ఆకె రవికృష్ణ
– రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్‌ క్రికెట్‌కు జిల్లా జట్టు ఎంపిక
కర్నూలు సీక్యాంప్‌:  నిత్యం వార్తల సేకరణలో మానసిక, శారీరక ఒత్తిడి ఉండే జర్నలిస్ట్‌లకు క్రీడలు చాలా అవసరం అని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. డిసెంబర్‌ 12నుంచి 15వ తేదీవరకు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు జిల్లా జట్టును మంగళవారం ఎంపిక చేశారు. అనంతరం ఎంపికైన 20 మంది సభ్యులుగల జట్టును జిల్లా ఎస్పీ ఆయన క్యాంప్‌ కార్యాలయంలో అభినందించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్, ప్రింట్‌ మీడియాలో పనిచేస్తున్న క్రీడాకారులకు ఎంపిక చేశామని మేనేజర్‌ మధుసుధాకర్‌ చెప్పారు. 
జిల్లా జర్నలిస్ట్‌ క్రికెట్‌ జట్టు ఇదే..
సాయికుమార్‌నాయుడు, ఎమ్‌ఎల్‌ రవికుమార్‌, వెంకటేశ్వర్లు, శ్యామ్‌కుమార్‌, గోపాలకృష్ణ, మోహన్‌, సుదర్శన్‌, నారాయణ, ప్రసాద్‌రెడ్డి, శేఖర్‌, ప్రదీప్‌కుమార్‌, చిరంజీవి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement