క్రీడలతో బుద్ధిమాంద్యులకు ఆరోగ్యం | Sports idiocy Health | Sakshi
Sakshi News home page

క్రీడలతో బుద్ధిమాంద్యులకు ఆరోగ్యం

Aug 9 2016 11:47 PM | Updated on Sep 4 2017 8:34 AM

క్రీడలతో బుద్ధిమాంద్యులకు ఆరోగ్యం

క్రీడలతో బుద్ధిమాంద్యులకు ఆరోగ్యం

బుద్ధిమాంద్యులు క్రీడల్లో పాల్గొంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆర్డీటీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ తెలిపారు. మంగళవారం ఆర్డీటీ క్రీడాగ్రామంలోని అథ్లెటిక్స్‌ ట్రాక్‌పై జాతీయస్థాయి పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల బుద్ధి మాంద్యుల అథ్లెటెక్స్‌ సన్నాహక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : బుద్ధిమాంద్యులు క్రీడల్లో పాల్గొంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆర్డీటీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ తెలిపారు. మంగళవారం ఆర్డీటీ క్రీడాగ్రామంలోని అథ్లెటిక్స్‌ ట్రాక్‌పై జాతీయస్థాయి పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల బుద్ధి మాంద్యుల అథ్లెటెక్స్‌ సన్నాహక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకలాంగులకు ఒలింపిక్స్‌ వికలాంగులకు పారా ఒలింపిక్స్, లాగా బుద్ధిమాంద్యులకు స్పెషల్‌ ఒలింపిక్స్‌ జరుగుతాయన్నారు. ఈ నెల 11 వరకూ సన్నాహక శిబిరం జరుగుతుందన్నారు. క్రమశిక్షణ, తర్ఫీదు పొందితే స్పెషల్‌ ఒలింపిక్స్‌లో రాణించవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్డీటీ స్పెషల్‌ ఒలింపిక్స్‌ జర్నీ అనే ఆంగ్ల పుస్తకాన్ని మాంఛో ఫెర్రర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ స్పెషల్‌ ఒలింపిక్‌ భారత్‌ సమన్వయకర్త రాజశేఖర్, ఆర్డీటీ సీబీఆర్‌ డైరెక్టర్‌ దశరథ్, కోచ్‌లు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement