ఏలూరు అర్బన్ : రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన సురేంద్రనాథ్ మిశ్రా (26) సోమవారం అమరావతి ఎక్స్ప్రెస్లో వాస్కోడిగామా నుంచి ఖరగ్పూర్ వెళ్తున్నాడు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
Sep 20 2016 1:48 AM | Updated on Apr 3 2019 7:53 PM
ఏలూరు అర్బన్ : రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన సురేంద్రనాథ్ మిశ్రా (26) సోమవారం అమరావతి ఎక్స్ప్రెస్లో వాస్కోడిగామా నుంచి ఖరగ్పూర్ వెళ్తున్నాడు. రైలు ఏలూరు ఆశ్రం కళాశాల సమీపంలోకి రాగానే కంపార్ట్మెంట్ మెట్లపై కూర్చున్న సురేంద్రనాథ్ మిశ్రా హఠాత్తుగా జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement