శివరాత్రికి రూ.3.11 కోట్ల ఆదాయం
కర్నూలు (రాజ్విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్కు శివరాత్రి పండుగ లాభాలు తెచ్చి పెట్టింది. 10రోజుల పాటు శ్రీశైలంతోపాటు వివిధ శైవ క్షేత్రాలకు 12డిపోల నుంచి 340 ప్రత్యేక బస్సులు నడిపారు. రూ. 49లక్షల ఆదాయార్జనతో ఆదోని డిపో మొదటి స్థానంలో ఉండగా ఎమ్మిగనూరు, నంద్యాల డిపోలు రూ.46 లక్షలు ప్రకారం సాధించాయి. ఆళ్లగడ్డ, డోన్ డిపోలు చివరి స్థానంలో నిలిచాయి. కర్నూలు-1, 2డిపోలు ఈ సారి వెనుకబడ్డాయి.