చింతలపూడి : చింతలపూడి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చిమటా సోమయ్య (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వ్యక్తి ఆత్మహత్య
Nov 14 2016 2:25 AM | Updated on Nov 6 2018 7:56 PM
చింతలపూడి : చింతలపూడి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చిమటా సోమయ్య (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం పొలానికి వెళ్లిన సోమయ్య సాయంత్రం ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆదివారం మృతుని కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సైదానాయక్ తెలిపారు.
Advertisement
Advertisement