రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అనుమప చక్రవర్తి, కార్యదర్శి ఎంఏ సోమశేఖర్లు తెలిపారు.
10న జాతీయ లోక్ అదాలత్
Aug 31 2016 11:27 PM | Updated on Sep 4 2017 11:44 AM
కర్నూలు (లీగల్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అనుమప చక్రవర్తి, కార్యదర్శి ఎంఏ సోమశేఖర్లు తెలిపారు. అందులో రాజీకాగల క్రిమినల్, సివిల్, బ్యాంకు, ప్రిలిటిగేషన్, ఇన్సురెన్స్ కేసులు పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. అవకాశాన్ని జిల్లాలోని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement