∙ గుర్తించిన జిల్లా యంత్రాంగం
∙ రేపు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
∙ అనర్హుల్లో ఎక్కువమంది వితంతువులే
రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఒంటరి మహిళల లెక్క తేలింది. 5,054 మంది అర్హులను గుర్తించారు. ఏ ఆధారమూ లేని వీరి ఎదురుచూపులకు రెండు రోజుల్లో మోక్షం లభించనుంది. జీవనభృతి కోసం గుర్తించిన ఈ లబ్ధిదారులకు ఆదివారం ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత నెల 8 నుంచి 25 తేదీ వరకు ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లాలో నాలుగు వేల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు తొలుత అంచ నా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,017 దరఖాస్తులు అందాయి. వీటిని గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు రెండు దశల్లో అధికారులు పరిశీలన చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి పూర్వపరాలు ఆరా తీసి పరిశీలన జరిపారు. ఆ తర్వాత దశలో అన్ని దరఖాస్తుల్లో 10 శాతం రాండమ్గా మరోసారి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు ఉన్న 5,054 మంది అర్హులను జీవనభృతికి ఎంపిక చేశారు. రెండు రోజుల కిందటే ఈ జాబితా ఖరారైంది. కలెక్టర్ రఘునందన్ రావు కూడా జాబితాకు ఆమోదముద్ర వేశారు. అనర్హుల్లో చాలామంది వితంతువులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఏదో ఒక పెన్షన్ పొందుతున్న వాళ్లూ దరఖాస్తుదారుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిని తిరస్కరించామని వివరిస్తున్నారు. అర్హత సాధించిన వారిలోనూ 80 శాతం విడాకులు తీసుకున్న లబ్ధిదారులే ఉన్నారని సమాచారం. మిగిలిన వారు అవివాహితులై తల్లిదండ్రులపై ఆధారపడిన వారేనని తెలిసింది.
ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా..
గుర్తించిన లబ్ధిదారులకు ఆదివారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ నియోజవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ద్వారా ప్రొసీడింగ్స్ని లబ్ధిదారులకు అప్పగిస్తారు. మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఆ తంతు జరగనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2వేలు జమ చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకు ద్వారా డబ్బులు అందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా అందజేస్తారు. వీరికి వారంలోగా భృతి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అప్పటికప్పుడే వారి వేలిముద్రలు తీసుకుని డబ్బులు అందజేస్తారని పేర్కొంటున్నారు.
మొత్తం లబ్ధిదారులు : 5,054
గ్రామీణ ప్రాంతాల్లో : 3,300
జీహెచ్ఎంసీ పరిధి : 1,352
షాద్నగర్ మున్సిపాలిటీ : 78
మీర్పేట మున్సిపాలిటీ : 56
జిల్లెలగూడ మున్సిపాలిటీ : 37
జల్పల్లి మున్సిపాలిటీ : 62
బడంగ్పేట నగర పంచాయతీ : 79
ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ : 26
పెద్ద అంబర్పేట నగర పంచాయతీ : 64
5,054
Published Sat, Jun 3 2017 12:27 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
సీరియస్గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'రా రాజా'.. టీజర్తోనే భయపెట్టారు!
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
డిప్యూటీ సీఎం పవన్ ఛాంబర్
అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..!
తప్పక చదవండి
- ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
- అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
- T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్
- ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
- ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
Advertisement