సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు | Sakshi
Sakshi News home page

సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు

Published Sun, Nov 20 2016 1:41 AM

సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు - Sakshi

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం

 సాక్షి, అమరావతి :  పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీ సామాన్యులపైనే సర్జికల్ దాడులు చేశారని, సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సంపన్న వర్గాలకు ఈ విషయమై ముందే లీకులు అందాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. విజయవాడ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు, వెంకయ్య నాయుడుతోపాటు బీజేపీ, మిత్రపక్షాలకు నోట్ల రద్దు ముందుగానే తెలియడంతో వారు లీకులు ఇచ్చి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడారని ఆరోపించారు.

ఇదంతా మోదీ చేస్తున్న లాలూచీ కుస్తీ అని, నోట్ల రద్దు బెడిసి కొట్టడంతో కొందరు తనను అంతం చేస్తారంటూ ఆయన సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయో గిస్తున్నారన్నారు. నోట్ల రద్దు అంశంపై తక్షణం జారుుంట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement