'ఇది ఎలా అనైతికం కాదో చంద్రబాబు స్పష్టం చేయాలి' | Mandha krishna madiga takes on chandrababu | Sakshi
Sakshi News home page

'ఇది ఎలా అనైతికం కాదో చంద్రబాబు స్పష్టం చేయాలి'

Feb 23 2016 3:05 PM | Updated on Oct 9 2018 5:22 PM

'ఇది ఎలా అనైతికం కాదో చంద్రబాబు స్పష్టం చేయాలి' - Sakshi

'ఇది ఎలా అనైతికం కాదో చంద్రబాబు స్పష్టం చేయాలి'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మందకృష్ణ మాదిగ మంగళవారం అనంతపురంలో మండిపడ్డారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మందకృష్ణ మాదిగ మంగళవారం అనంతపురంలో మండిపడ్డారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే అనైతికమని చంద్రబాబు ఆరోపించారు. అదే చంద్రబాబు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా తన పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇది ఎలా అనైతికం కాదో స్పష్టం చేయాలని చంద్రబాబును మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 30న విజయవాడలో ఎస్సీ వర్గీకరణపై విశ్వరూప మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మాదిగల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తిరుగుబాటు చేస్తామని మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement