వరంగల్లో రాజకీయ పక్షాల ర్యాలీ... ఉద్రిక్తత | high tension in warangal | Sakshi
Sakshi News home page

వరంగల్లో రాజకీయ పక్షాల ర్యాలీ... ఉద్రిక్తత

May 19 2016 2:50 PM | Updated on Sep 4 2017 12:27 AM

ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో వివిధ రాజకీయ పక్షాలు చేపట్టిన ర్యాలీ గురువారం ఉద్రిక్తతకు దారితీసింది.

వరంగల్: ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో వివిధ రాజకీయ పక్షాలు చేపట్టిన ర్యాలీ గురువారం ఉద్రిక్తతకు దారితీసింది. ములుగు నుంచి వివిధ రాజకీయపక్షాల నాయకులు కలసి వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు.

వారి ర్యాలీని వరంగల్ ఏకశిలా పార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆ క్రమంలో రాజకీయ పక్షాల నేతలు, పోలీసుల వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement