వ్యవసాయ రంగంపై సర్కార్ నిర్లక్ష్యం | Government neglect of the agricultural sector | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగంపై సర్కార్ నిర్లక్ష్యం

Sep 19 2016 3:04 AM | Updated on Sep 19 2019 8:44 PM

వ్యవసాయ రంగంపై సర్కార్ నిర్లక్ష్యం - Sakshi

వ్యవసాయ రంగంపై సర్కార్ నిర్లక్ష్యం

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ధ్వజం

 హుజూర్‌నగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని 10 జిల్లాల్లో 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 107 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడాదికి 20 నుంచి 25 శాతం చొప్పున ఆహార ఉత్పత్తులు తగ్గిపోతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను 49 లక్షల టన్నులకు పడిపోయాయన్నారు. రాష్ట్రంలో ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇదే మాదిరిగా 20 నుంచి 25 శాతం ప్రతి ఏడాది  తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement