ఆర్టీసీ బస్సులో టేకు దుంగలు స్వాధీనం | forest officials wood recovered in rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో టేకు దుంగలు స్వాధీనం

Dec 21 2015 11:59 PM | Updated on Oct 4 2018 6:03 PM

బెల్లంపల్లి మండలం సోమగూడెం వద్ద సోమవారం రాత్రి అటవీశాఖ అధికారులు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

కాశీపేట(ఆదిలాబాద్ జిల్లా): బెల్లంపల్లి మండలం సోమగూడెం వద్ద సోమవారం రాత్రి అటవీశాఖ అధికారులు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కాశీపేట మండలం దేవపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో అక్రమంగా టేకు దుంగలను తీసుకువెళ్తున్నారని అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. బస్సు కింద ఉన్న స్టోరేజ్ పార్ట్‌లో దాచి ఉంచిన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement