అన్నదాత బలవన్మరణం | farmer suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత బలవన్మరణం

Apr 8 2017 8:59 PM | Updated on Nov 6 2018 7:53 PM

అన్నదాత బలవన్మరణం - Sakshi

అన్నదాత బలవన్మరణం

అప్పుల బాధ తాళలేక ఓ రైతు థిమెట్‌ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

- అప్పులబాధ తాళలేక ఆత్మహత్య
 
జూపాడుబంగ్లా: అప్పుల బాధ తాళలేక ఓ రైతు థిమెట్‌ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..భాస్కరాపురం గ్రామానికి చెందిన మల్లయ్య చిన్న కుమారుడు శివమసన్న (36) తన వాటాగా వచ్చిన ఐదు ఎకరాల పొలంతోపాటు మరో ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. మిరప, కంది, ఉల్లి తదితర పంటలు సాగుచేసుకొంటూ జీవించేవాడు. రెండేళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో రూ.10లక్షల అప్పు మిగిలింది. బ్యాంకులో రూ.4 లక్షలు, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ.6 లక్షలు అప్పు చేశాడు.
 
కొంతకాలంగా రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావటంతో శిమమసన్న మానసిక ఆందోళనకు గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో థిమెట్‌ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య శకుంతలమ్మ, కుమార్తె రేణుక, కుమారుడు మహేష్‌ ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందటంతో భార్యా, పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అశోక్‌.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement