విద్యార్థులకు ఈటల హామీ | eetala Rajinder assurance to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఈటల హామీ

Feb 27 2016 4:46 PM | Updated on Jul 11 2019 5:33 PM

పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ను విద్యార్థులు ఘెరావ్ చేశారు.

కరీంనగర్: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ను విద్యార్థులు ఘెరావ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం విద్యార్థుల దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న మంత్రి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా.. విద్యార్థులకు త్వరలోనే నిధులను విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఈటల వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement