స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు | competitions to students for independence day | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు

Aug 12 2016 10:31 PM | Updated on Sep 4 2017 9:00 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : స్వాతంత్య్రదిన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని డీఈవో డి.మధుసూదనరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : స్వాతంత్య్రదిన పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని డీఈవో డి.మధుసూదనరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ నెల 16న 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 17న స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ పాత్ర అనే అంశంపై 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 18న దేశభక్తి పాటల పోటీలు, 19న స్వాతంత్య్రోద్యమంపై సాంస్కృతిక నాటిక పోటీలు,  20న స్వాతంత్య్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు పోరాటం అనే అంశంపై 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. 21న 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీరసైనికుల చిత్రాల చిత్రలేఖనం పోటీలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జాతీయ సమైక్యతపై నినాదాలు రాసే పోటీలు, 23న ఉదయం ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించి, బహిరంగ కూడలిలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement