కర్నూలు పట్టణంలోని బుధవారపేటలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు.
కర్నూలు పట్టణంలోని బుధవారపేటలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇంటి గోడ కూలి సుమంత్ (15)పై పడిపోగా తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడు. మరోవైపు భారీ వర్షం కారణంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆదివారం ఉదయం కూడా వర్షం కొనసాగుతోంది.