
ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలి
క్రీడల్లో రాణించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జార్జ్కారొనేషన్క్లబ్లో శుక్రవారం 62వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–19 రైఫిల్షూటింగ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ప్రొద్దుటూరు కల్చరల్:
క్రీడల్లో రాణించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జార్జ్కారొనేషన్క్లబ్లో శుక్రవారం 62వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–19 రైఫిల్షూటింగ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిత్యం క్రీడాసాధన చేస్తూ దేశం గర్వపడే క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఆర్ఐపీఈ భానుమూర్తిరాజు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమే అని చెప్పారు. క్రీడల వల్ల ఏకాగ్రత, శారీరకధృడత్వం, పోటీతత్వం, పెరుగుతాయన్నారు. ఎస్జీఎఫ్ఐ అండర్–19 కార్యదర్శి విజయప్రసాదరెడ్డి, రీజనల్ స్పోర్ట్ అధికారి మురళీకృష్ణ, డీవీఈఓ చంద్రమౌళి ప్రసంగించారు. రైఫిల్ విభాగంలో ఓపెన్సైట్, పీప్సైట్, పిస్టల్ విభాగాలో క్రీడాకారులకు పోటీలను నిర్వహించారు. కడప, కర్నూలు, చిత్తూరు, విశాఖ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు జరగనున్నాయి. కౌన్సిలర్ జయశంకర్, జార్జిక్లబ్ కార్యదర్శి మార్తల సుధాకరరెడ్డి, మాజీ అండర్–19 స్పోర్ట్స్ కార్యదర్శి సుబ్బరాజు, ఆర్గనైజర్ శ్రీనివాసులరెడ్డి, పీఈటీలు శివారెడ్డి, సుబ్బరాజు, సుధాకరరెడ్డి, రాఘవ, అంకారావు తదితరులు పాల్గొన్నారు.