ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం | air india flight near misses mishap | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

May 28 2016 12:55 PM | Updated on Oct 2 2018 7:37 PM

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం - Sakshi

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఉదయం ఓ విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.

గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఉదయం ఓ విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానం రెక్కల్లోకి టేకాఫ్ సమయంలో ఓ గద్ద ప్రవేశించింది. దాంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని కిందికి దించేశాడు. విమానం సురక్షితంగా రన్‌వేపై దిగటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ విమానంలో మొత్తం 116 మంది ప్రయాణికులున్నారు. అందరినీ సురక్షితంగా కిందకు దింపారు. అయితే.. హరిద్వార్ వెళ్లాల్సిన యాత్రకులు 60 మంది కూడా ఈ బృందంలో ఉన్నారు. తమను ఈరోజే ఢిల్లీకి పంపాలని, అక్కడి నుంచి తమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయినందున అవి మిస్సయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా అధికారులతో గన్నవరం విమానాశ్రయంలో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement