అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కనేర్గాం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణ(48) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు పెరిగిపోవడంతో.. తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.